సూర్యాపేట ప్రగతి నివేదన సభకు ఆదివారం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టణంలోని ఎస్వీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు సోమ భరత్కుమార్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పల్లె రవికుమార్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం అనిల్కుమార్రెడ్డి తదితరులు ఉన్నారు.