హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూహెచ్ను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకటో తేదీన రావాల్సిన జీతాలు ఆలస్యంగా అందగా.. జీతాల జమ విషయంలోనూ తాజాగా మరో వివాదం వెలుగుచూసింది. ఒకరికి పడాల్సిన జీతాలు మరొకరికి పడ్డాయి. బోధనేతరసిబ్బందికి బోధ నా సిబ్బంది స్కేళ్లు జమ అయ్యా యి. ఓ సీనియర్ ప్రొఫెసర్ వేతనం ప్రొఫెసర్ స్కేల్ జమ అయ్యింది.
మొత్తంగా ఇది గందరగోళానికి దారితీసింది. ఓ సీనియర్ ప్రొఫెసర్కు వేతనం జమ కాలేదు. సీనియర్ ప్రొఫెసర్కు ప్రొఫెసర్ జీతం పడగా.. ఒకే పేరు గల ఉద్యోగులు పలువురు ఉండగా ఒకరి జీతాలు మరొకరికి జమ అయినట్టు తెలిసింది. ఈ నెల నుంచి ట్రెజరీ నుంచి జమ చేశారు. ఈ క్రమంలోనే పొరపాట్లు జరిగినట్టు వర్సిటీవర్గాల ద్వారా తెలిసింది.