నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో టీఆర్ఎస్ నేత రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
కాగా, నిన్న రంగారెడ్డి జిల్లాలోని ఓఆర్ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లికార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు.