రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. పట్టణ నడిబొడ్డులో పాత జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ అభివృద్ధిని జీర్ణించుకోలేని విపక్షాల వలలో పడ్డ ఒక్కరిద్దరు కోర్టును ఆశ్రయిండంతో కొన్నిచోట్ల పనులు ఆగాయని, అవి కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. గాంధీ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు డివైడర్తో కూడిన రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పట్టణమంతా కొద్దిరోజుల్లోనే గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్తో దగదగ మెరువనున్నట్లు తెలిపారు. సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్లో బోటింగ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని. ఇప్పటికే ట్రైల్ రన్ జరుగగా, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ను తలపించేలా సూర్యాపేటలో శిల్పారామమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ పార్కును సరికొత్తగా తీర్చిదిద్దడంతోపాటు అక్కడే జంక్షన్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
మెడికల్ కళాశాల, నూతన కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయం, గిరిజన గురుకుల పాఠశాల, రెండు ట్యాంక్బండ్లు, ఇంటిగ్రేటేడ్ మోడ్రన్ మార్కెట్తోపాటు త్వరలో ఏర్పాటు కానున్న శిల్పారామంతో సూర్యాపేట తెలంగాణ రాష్ర్టానికే ఆదర్శంగా నిలువనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్, శిల్పారామం స్పెషల్ అధికారి జి.కిషన్రావు, కలెక్టర్ వెంకట్రావ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్ అనంతుల యాదగిరి, నాయకుడు ఉప్పల ఆనంద్ ఉన్నారు.
మే చివరి నాటికి అభివృద్ధి పనులు పూర్తవ్వాలి
సూర్యాపేట : జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు మే చివరి నాటికి పూర్తవ్వాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సూర్యాపేట మున్సిపల్ అభివృద్ధి పనులు, పురోగతిపై కలెక్టర్ వెంకట్రావ్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో అధికారులు ఎక్కడా రాజీపడకుండా పనులు చేయించాలని ఆదేశించారు. సద్దుల చెరువు పక్కన 5 ఎకరాల్లో అన్ని వసతులతో ఫుడ్కోర్టు, బోటింగ్, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్ ద్వారా సద్దుల చెరువును పరిశీలించి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, మోహన్రావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ జగ్గూనాయక్, తాసీల్దార్ వెంకన్న పాల్గొన్నారు.
బాల సదనం ప్రారంభం
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయకాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల సదనాన్ని(చిల్డ్రన్ హోమ్) మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. మంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. బాల సదనంలో సౌకర్యాల గురించి జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి జ్యోతిపద్మను అడిగి తెలుసుకున్నారు. బాల సదనంలోని రూములను మంత్రి సందర్శించి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బాలికలు జయ జయహే తెలంగాణ అంటూ తెలంగాణ జాతీయ గీతాన్ని ఆలపించి ఆకట్టుకున్నారు. వారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్లు మాలోతు కమలాచంద్రునాయక్, బాషా, చింతలపాటి భరత్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్, బాలల సంక్షేమ సమితి చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు
సూర్యాపేట టౌన్ : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందన్న వెంకట్రెడ్డి వ్యాక్యలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి జగదీశ్రెడ్డిని విలేకరులు అడుగగా ఈ విధంగా స్పందించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఏ పార్టీ గురించి మాట్లాడుతారో వారికే తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఒకరు కాంగ్రెస్లో ఉండి బీజేపీని గెలిపించమంటారు.. మరొకరు బీజేపీలో ఉండి కాంగ్రెస్ను గెలిపించమంటారు. అంతేకాకుండా కాంగ్రెస్లో ఉన్న బ్రదర్ బీజేపీ గెలుస్తుందని.. బీజేపీలో ఉన్న బ్రదర్ కాంగ్రెస్ గెలుస్తుందని అయోమయ పరిస్థితిలో ఉన్న ఇరువురు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజల్లో మరింత నవ్వుల పాలవుతున్నారన్నారు. అందుకే వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.