ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని రంగాల ప్రజల ఆదరాభిమానాలు పెంపొందించుకున్నామని.. ప్రభుత్వానికి, జనానికి మధ్య వారధులుగా నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలే బీఆర్ఎస్కు కొండంత బలగమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ మండల స్థాయి కమిటీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభివృద్ధిని జీర్ణించుకోలేక విపక్షాలు చేస్తున్న విషపూరిత ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయన్నారు. పరీక్ష పేపరు లీకేజీలతో యువతను బీఆర్ఎస్కు దూరం చేయాలనే కుట్రకు బీజేపీ తెరలేపిందని, అందులో సూత్రధారి బీజేపీ నేత బండి సంజయ్ అని తేలడంతో ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పలేక నీళ్లు మింగుతున్నారని ఎద్దేవా చేశారు.
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 6 : కార్యకర్తలే బీఆర్ఎస్కు కొండంత బలగమని..పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సూర్యాపేట నియోజకవర్గంలోని మండల స్థాయి కమిటీలతో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా నిరంతరం అభివృద్ధి పాలన కొనసాగిస్తూ అన్ని రంగాల ప్రజల ఆదరాభిమానాలు పెంపొందించుకున్నామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధ్ధిని జీర్ణించుకోలేక విపక్షాలు చేస్తున్న విషపూరిత ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయన్నారు. పేపరు లీకేజీలతో యువతను బీఆర్ ఎస్కు దూరం చేయాలనే కుట్రకు బీజేపీ తెరలేపిందని, అందులో కుట్ర బీజేపీ నేత బండి సంజయ్దే అని తేలడంతో ఆ పార్టీ నేతలను ఆ విషమై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నీళ్లు మింగుతున్నారన్నారు. బీఆర్ఎస్ బలగాన్ని చూసి విపక్షాల్లో వణుకు మొదలైందని.. ఈ సారి కూడా తమకు ఓటమి తప్పదనే భయం వారిని వెంటాడుతుందని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారని.. ఎవరి పంతాలో వారు పాదయాత్రలు, ప్రచార రథాలను తిప్పుతూ ప్రజలకు చేరువకావాలనే ఆశ తో కుప్పిగంతులు వేస్తున్నారని పేర్కొన్నారు. 2014 కు ముందు తరువాత అభివృద్ధిలో జరిగిన మార్పులు ప్రజలందరికీ తెలుసునని.. ఆయా పార్టీల నాయకులను ప్రజలు నిలదీస్తున్నట్టు తెలుస్తున్నదన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆత్మకూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొల్ల వెంకట్రెడ్డి, కందగట్ల గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొండేటి రవీందర్రెడ్డిని ప్రకటించి వారిని ప్రత్యేకంగా అభినందించారు.
బీఆర్ఎస్తోనే మైనార్టీల సంక్షేమం
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి గుంటకండ్ల జగ దీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ను పార్టీని వీడిన ముస్లిం నాయకులు బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో కౌ న్సిలర్ చింతలపాటి భరత్, బీఆర్ఎస్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణు గోపా ల్రెడ్డి, తాహేర్,జానీ,రియాజ్, సయ్యద్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన మున్సిపల్ కాంట్రాక్టర్లు
బొడ్రాయిబజార్ :మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జలీల్పాషా ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు మంత్రి జగదీశ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు తమ సమస్యలను విన్నవించగా పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారు.