ఎవరూ అడగకుండానే అందరి అవసరాలు తెలుసుకుని వరాలు కురిపించే మహా నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పోరాడిసాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ అంగన్వాడీల కేంద్రాల అప్గ్రేడ్పై సంతోషం వ్యక్తం చేస్తూ అంగన్వాడీలు సోమవారం సూర్యాపేట కార్యాలయంలో మంత్రిని కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ నేడు, నిరంతర అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఇతర రాష్ర్టాల ప్రజలు సైతం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నాయని తెలిపారు.
– సూర్యాపేట టౌన్, ఆగస్టు 28
సూర్యాపేట టౌన్, ఆగస్టు 28 : అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్నేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమేనని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసు పెం పుతో పాటు అనంతరం బెన్ఫిట్లు అందేలా కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించడాన్ని హర్షిస్తూ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు సోమవారం పెద్ద ఎత్తున మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా నిరంతర అభివృద్ధి పాలన సాగిస్తూ అందరినీ అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు. ఉమ్మడి పాలకుల హయాంలో వెనుకబడిన రాష్ర్టాన్ని తొమ్మిదేండ్లలోనే అభివృద్ధితో రాష్ర్టాన్ని యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
నిస్వార్థ పాలన, నిరంతర అభివృద్ధే సీఎం కేసీఆర్ తమకు నేర్పించాడని తెలిపారు. అటువంటి గొప్ప నాయకున్ని మించిన నాయకుడు యావత్ దేశంలోనే లేడన్నారు. యావత్ దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్టంలో ప్రజలకు 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిసున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. నిరంతర విద్యుత్తో పాటు తాగు, సాగు నీరు అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో అభివృద్ధి కనిపిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రమేర్పడితే ఏదైతే సాధించుకుంటామని కళలు కన్నామో ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి కళ సాకరం అవుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ, జిల్లా అధ్యక్షురాలు తాటిపాముల నాగలక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి సుజాత, అంగన్వాడీ టీచర్లు గుండగాని సుజాత, కలకోట జ్యోతి, శైలజ, శారద, సోమగాని రమణ, అనసూర్య, చంద్రకళ, సుధ, ఉమ, ఇందిర, కవిత పాల్గొన్నారు.