వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా కొనసాగుతున్నాయి. బుధవారం దేవరకొండ మండలం జర్పులతండాకు చెందిన 60 కుటుంబాలు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. గుర్రంపోడు మండలం పిట్టలగూడెం, ఊట్లపల్లి, నిడమనూరు మండలం వెంకటాపురం, పెద్దవూర మండలం చింతపల్లి, ఎర్రగుంటతండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పకొన్నారు.
– దేవరకొండ రూరల్/హాలియా/ఆగస్టు 30
దేవరకొండ రూరల్, ఆగస్టు 30 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని జర్పుల తండాకు చెందిన 60కుటుంబాల వారు బుధవారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు.
గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక తండాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సీహెచ్.సుభాశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, కాశిరెడ్డి రవీందర్రెడ్డి, జడ్పీటీసీ సలహాదారు మారుపాక సురేశ్గౌడ్, మాజీ ఎంపీటీసీ బిక్కునాయక్, నాయకులు జైహింద్రెడ్డి, దాసు, చందు, సాయిరాం పాల్గొన్నారు.