బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం పీఏ పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మోతె మండలం హుస్సేన్బాద్, కరక్కాయలగూడెం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
– దేవరకొండ/మోతె, సెప్టెంబర్ 20
దేవరకొండ, సెప్టెంబర్ 20 : బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సమక్షంలో పీఏపల్లి మండల కేంద్రానికి చెందిన 60కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
పార్టీలో చేరిన వారు సభ్యత్వం తీసుకుని బీమా సౌకర్యం పొందాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో జెల్లా వెంకటేశ్వర్లు, పిల్లి రామయ్యతో పాటు 60 కుటుంబాల వారు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తోటకూరి పరమేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెర మణీపాల్రెడ్డి, లచ్చిరెడ్డి, పాల్వాయి రంగారెడ్డి, బోడ్డుపల్లి మహేందర్, బొల్లిగొర్ల కొండల్యాదవ్, రవి, మల్లేశ్యాదవ్ పాల్గొన్నారు.