తుంగతుర్తి, మే 20 : ఈ నెల 25న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.