రామన్నపేట, ఫిబ్రవరి4 : మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, మధురకవి కూరెళ్ల
విఠలాచార్య పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఘనంగా సత్కరించింది.
తెలంగాణ భాష, సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.