చందంపేట, మార్చి 5 : గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కంబాలపల్లిలో మంగళవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య కుమారుడు ముత్యాల వెంకటేశ్, తల్లి ముత్యాల లక్ష్మమ్మ జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయనతోపాటు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. మండలంలోని కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులవలయం, పొగిళ్ల, ఉస్మాన్కుంట, యల్మలమంద గ్రామాలకు చెందిన ప్రజలు శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, టీవీఎన్ రెడ్డి, శంకర్నాయక్, శ్రీనివాస్గౌడ్, ముత్యాల చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ రాములమ్మ, పరమేశ్యాదవ్, అనంతగిరి, మల్లారెడ్డి, వడ్త్య బాలు, లయన్స్ క్లబ్ సభ్యులు వనం భిక్షమయ్య, గాజుల రాజేశ్, జంగయ్య, ప్రభాకర్, సత్యనారాయణ పాల్గొన్నారు.