నల్లగొండ : త్వరలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నక్కలగండి ప్రాజెక్టు, పెండ్లిపాకుల ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల ఆర్ అండ్ ఆర్, భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు.
జాన్ లోగా నక్కలగండి, సింగారాజుపల్లి, గొట్టిముక్కుల రిజర్వాయర్లు పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లోని కెనాల్స్కు మరమ్మతులు చేపట్టాలని, కెనాల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. రూ.21 లక్షలతో గేట్ల మరమ్మతులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఆయన కోరారు.
ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గంలో లక్షా 60 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం లక్ష్యం అని ఆయన అన్నారు. పొగిల్లా లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 24.64 కోట్లు, కంబాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.202.15 కోట్లు, అంబా భవాని లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.184.56 కోట్లు, పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.82.727 కోట్లు, ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.90.96 కోట్లతో పనులు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సమావేశంలో సీఈ శ్రీకాంత్ రావు, ఎస్ఈలు వెంకటేశ్వర్ రావు, అజయ్ కుమార్,ఈఈలు కే.శ్రీధర్ రావు, జగన్మోహన్, యలమందయ్య, డీఈలు, ఏఈలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.