కోదాడ, జనవరి 1 : బీఆర్ఎస్ పార్టీపై పూర్తి భరోసాతోనే పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన సమక్షంలో మునగాల మండలంలోని విజయరాఘవపురం గ్రామానికి చెందిన సుమారు 20కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం ఇస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడే వారికి ప్రతి స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో సోమపంగు నరేశ్, కుసుమ కుమా రి, హరికృష్ణ, సాయికుమార్, అశోక్తో పాటు 20 కుటుంబాల వారు ఉన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుంకర అజయ్కుమార్, బీఆర్ఎస్ పార్టీ మునగాల మండలాధ్యక్షుడు రమేశ్, సైదులు, లింగారావు పాల్గొన్నారు.