నేరేడుగొమ్ము(చందంపేట), ఫిబ్రవరి 26 : రాజ్యాంగంలోని చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.నవీన్రావు, కె.లక్ష్మణ్ సూచించారు. జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన న్యాయ సేవా సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గృహ హింస, స్త్రీ సాధికారత, చట్టపరమైన హక్కులు, బాల్య వివాహాల నిషేధం, సైబర్ నేరాలతో పాటు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.
కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, బాల్య వివాహాలు, చట్టబద్ధత లేకుండా దత్తత ఇవ్వడం నేరమని పేర్కొన్నారు. అనంతరం జడ్జిలు వైజాక్ కాలనీ సమీపంలోని కృష్ణా వెనుక జలాల్లో మర బోటులో పర్యటించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెషన్స్ జిల్లా జడ్జి జగ్జీవన్కుమార్, దేవరకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, దేవరకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమాశంకర్, ఇన్చార్జి ఆర్డీఓ లీలా, డీఎస్పీ నాగేశ్వర్రావు, తాసీల్దార్ అరుణ, ఎంపీడీఓ ఝాన్సీ లక్ష్మీభాయి, సీఐ పరశురాం, ఎస్ఐలు రాజు, యాదయ్య, తాసీల్దార్ అరుణ, సర్పంచ్ అంజయ్య, బిక్కూనాయక్, యుగేంధర్రెడ్డి పాల్గొన్నారు.