రామగిరి, జనవరి 20 : జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు శనివారం నిర్వహంచిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,254 మంది విద్యార్థులకు గానూ 12 పరీక్ష కేందాల్రను ఏర్పాటు చేయగా 1,657 మంది హాజరై పరీక్ష రాశారు.
597 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి పర్యవేక్షించారు. 12 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 12 మంది అబ్జర్వర్లు, 12 మంది రూట్ ఆఫీసర్లను నియమించి ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు డీఈఓ తెలిపారు.