గరిడేపల్లి, అక్టోబర్ 20 : బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెంది ప్రజలంతా ఆనందంగా ఉన్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన సలికంటి శ్రీను, సైదిరెడ్డి, సిద్ధ రామయ్య, సిద్ధ లక్ష్మయ్య తదితరులు స్థానిక సర్పంచ్ కర్నాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధిని చూసి అన్ని పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. అంతకుముందు గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్నాటి నాగిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బా రెడ్డి గోవిందరెడ్డి, నాయకులు పెండెం సైదులు, గుమ్మడెల్లి రాముడు, పగిడి అంజయ్య, కర్నాటి శ్రీనివాస్రెడ్డి, బోగాల జనార్దన్రెడ్డి, బరిగెల కృష్ణ, తేల రవి పాల్గొన్నారు.