హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ అన్నారు.
ఆదివారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిడమనూరు, పెద్దవూర మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల విస్కృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి ప్రభుత్వానికి మద్య వారధిలా పని చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ బోల్లం జయమ్మ, హనుమంతరాజు, ఇరిగినేని అంజయ్య, షేక్ అబ్బాస్, నడ్డి బాలరాజు, శంకర్, శ్రీలత, రవినాయక్, సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.