నల్లగొండ : నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర హోసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మద్ది విద్యాసాగర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, వారి పార్థివ దేహాన్ని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్ధి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే పలు పార్టీల నేతలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో నివాళులర్పించారు.