సారంగాపూర్, మే 10 : అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని(Stained grain) సర్కారు వెంటనే కొనుగోలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డిమాండ్(MLA Sanjay kumar) చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జగిత్యాల(Jagithyala) జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ పాలనలో రైతాంగానికి అండగా నిలిచారని గుర్తు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసి తరలించడంలో ఆలస్యం కావడం వల్ల వెయిట్లాస్ అయి రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గతంలో ప్రశ్నంచిన నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు, రైస్మిల్లర్లు ఇప్పడు కుమ్మక్కు అయ్యరా? అని నిలదీశారు. ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై జాయింట్ కలెక్టర్ను కూడా ఇటీవల కలిసి సమస్యలు వివరించానని చెప్పారు. ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతానన్నారు. జీవన్రెడ్డికి ఇంకా ఎమ్మెల్సీగా ఏడాది పదవీ కాలం ఉన్నదని, ఓట్ల కోసం రైతుల కష్టాలు మరిచారని, హామీలను నెరవేర్చని కాంగ్రెస్కు ఓట్లతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.