గుండాల: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు విరివిగా పంట ఋణాలను అందిస్తున్నట్లు టెస్కాబ్ వైస్ చైర్మన్, నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్రం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 107 సహకార సంఘాల్లో గత సంవత్సరం అత్యధికంగా గుండాల సహకార సంఘానికి 4.50 కోట్ల పంట ఋణాలను ఇచ్చినట్లు తెలిపారు.
గతంలో రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని నష్టపోయేవారని, నేడు రైతులు ఇబ్బం దులు పడొద్దనే ఉద్ధేశ్యంతోనే పంట ఋణాలు 25పైసల వడ్డీకే ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరానికి 25 లక్షల పంట ఋణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహకార సంఘాల అభివృద్ధికి రైతులు సహకరించాలని తీసుకున్న ఋణాలు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ప్రతి సంఘానికి వ్యాపార నిమిత్తం 2 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఎకరాకు 2లక్షల చొప్పున కనుమల్ లోన్లు ఇస్తున్న ట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు గృహ నిర్మాణం కొరకు భూమిని తనాఖా పెట్టుకుని గరిష్టంగా 30లక్షల వరకు హౌసింగ్ లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇతర దేశాలకు చదు వుల నిమిత్తం వెళ్ళే రైతుల పిల్లల చదువుల కొరకు ఎడ్యూకేషన్ లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా సహకార సంఘాల ద్వారా ఎకరానికి 4లక్షల చొప్పున భూమిని తనాఖా పెట్టుకుని ఎడ్యూకేషన్ లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాలను రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ.ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, హరితాదేవి, రామకృష్ణారెడ్డి, పాండరి, రమేశ్రెడ్డి, సంగి వేణుగోపాల్, సర్పం చ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.