యాదాద్రి భువనగిరి, జూన్ 27 : జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే సుమారు 50 వేల మంది విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాముకు చేరాయి.
వీటిని మంగళవారం నుంచి మండలాలకు చేర్చనున్నారు. ఆ తర్వాత రెండ్రోజుల్లో విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.