దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
చందంపేట, జూన్ 4 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రూ.28.96 లక్షలతో, ప్రాథమిక పాఠశాలలో రూ.23 లక్షలతో, పోల్యానాయక్ తండా పాఠశాలలో రూ.12.54 లక్షలు, గుంటిపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.11.85 లక్షలు, గన్నెర్లపల్లి పాఠశాలలలో రూ.18.44లక్షలు, మానావత్ తండా పాఠశాలలో రూ.11.18 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందిచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ నున్సావత్ పార్వతీచందు, జడ్పీటీసీ రమావత్ పవిత్ర, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొందేటి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, ఉపాధ్యక్షుడు యాసాని రాజవర్ధన్రెడ్డి, ఎంపీడీఓ రాములూనాయక్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య, సర్పంచ్ గోసుల కవిత, నాయకులు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, జక్కుల మున్నయ్య, కొండల్రెడ్డి, శ్రీశైలం, బొడ్డుపల్లి కృష్ణ, మహాలక్ష్మయ్య పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ఉ త్సాహంగా వాలీబాల్, ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభావంతులను వెలికితీసేందుకు ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు.
వైకుంఠధామాలు ప్రారంభం
మండలంలోని గుంటిపల్లి గ్రామంలో రూ.12.60 లక్షలతో, పొల్యానాయక్ తాండాలో రూ.12 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాలను రమావత్ రవీంద్రకుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పల్లెలన్నీ పచ్చగా, పరిశుభ్రంగా మారాయన్నారు.