నకిరేకల్, జూలై 20 : గొర్రెల పంపిణీ పథకం కింద గొల్లకురుమలందరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారని, రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.4,593 కోట్లు మంజూరు చేశారని రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. బుధవారం నకిరేకల్లో గొ్ర రెల పంపిణీ పథకం కింద మంజూరైన లబ్ధిదారుడు ఏషబోయిన వెంకటేశ్యాదవ్తో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గొల్లకురుమలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రెండో విడుత పంపిణీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ఎన్డీసీసీ ద్వారా రూ.4,593 కోట్లు విడుదల చేశారని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే రెండో విడుత కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
లబ్ధిదారుడు ఏషబోయిన వెంకటేశ్యాదవ్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా తనకు 21 గొర్రెలు అందజేయడం అభినందనీయమని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గుండెబోయిన యాదగిరి, తిరుగుడు రవి, జాల ఉపేందర్, మట్టిపల్లి నాగరాజు, కృష్ణ, రాంబాబు పాల్గొన్నారు.