నకిరేకల్, డిసెంబర్ 6 : నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతానని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, వారిని కాపాడడంలో ముందుంటానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ బాధ పడవద్దని అండగా ఉంటానన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజాస్వామ్య బద్ధ్దంగా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలన్నారు.
పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుం దన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజకొండ శ్రీనివాస్, నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, జడ్పీటీసీలు తరాల బలరాములు, మాద ధనలక్ష్మి, నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ఊట్కూరి ఏడుకొండలు, మారం వెంకట్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.