నకిరేకల్, మే 21: హైదరాబాద్లో ని నందినగర్లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ భవన్లో నిర్వహించనున్న పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ ప్రక్రియలో భాగంగా కేటీఆర్ను కలిసినట్లు చిరుమర్తి తెలిపారు.
పండగ వాతావరణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దృష్టి సారించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.