హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సీహెచ్ఏపీ రామేశ్వరరావు, సాయిచందన ఏపీఐ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రాణదాన ట్రస్టుకు చెరో రూ.50లక్షల చొప్పున విరాళం అందించారు.
ఈ మేరకు శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, రంగం శ్రీ పాల్గొన్నారు.