కోదాడ, జనవరి 09 : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాల వేగాన్ని నియంత్రించుకుని ప్రయాణిస్తూ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ జంక్షన్ వద్ద చేపట్టిన రహదారి మరమ్మతులను డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వాహనాల రద్దీ పెరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత నేషనల్ హైవే అధికారులకు సూచించారు. వాహనదారులకు అర్థమయ్యేలా డైరెక్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట పట్టణ సీఐ శివ శంకర్ నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి ఉన్నారు.

Kodada : పండుగ ప్రయాణం కావొద్దు విషాదం : ఎస్పీ నరసింహ