మిర్యాలగూడ, డిసెంబర్ 5 : రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని ఏడీఏ పోరెడ్డి నాగమణి రైతులకు సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా సోమవారం స్థానిక రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, వ్యవసాయ అధికారులు శ్రీనివాస్రావు, సృజన, కల్యాణ్చక్రవర్తి, ఏడుకొండలు, సైదులు పాల్గొన్నారు.
దామరచర్ల : మండలంలోని దామరచర్ల, వీర్లపాలెం, కొండ్రపోల్ గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఓ పార్వతీ చౌహాన్ భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓలు రమేశ్, పార్వతి, ప్రియాంక, సర్పంచులు పొన్నానాయక్, రాంబాబు, హతీరాం, దత్తూనాయక్ పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించాలి
నిడమనూరు : రైతులు భూసారాన్ని పరిరక్షించేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ అంకతి వెంకటరమణ అన్నారు. సోమవారం మృత్తిక సంరక్షణ దినోత్సవం సందర్భంగా మండలంలోని ఇండ్లకోటయ్యగూడెంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓ ముని కృష్ణయ్య, ఏఈఓ అనిల్, రైతులు పాల్గొన్నారు.
పెద్దవూర : మండలంలోని తుంగతుర్తి గ్రామ రైతువేదికలో రైతులకు ఏఓ సందీప్కుమార్ అవగహన కల్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గజ్జెల లింగారెడ్డి, గ్రామ కోఆర్టినేటర్ బోయ నరేందర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో..
నార్కట్పల్లి: మండలకేంద్రంలోని రైతు వేదికలో మట్టి నమూనా పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మ జీవుల పరిరక్షణ కోసం నేల జీవనశక్తిని కొనసాగించే ఉద్దేశంతో ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వై గిరిప్రసాద్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
మునుగోడు/ మునుగోడు రూరల్ : మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్గౌడ్, టెక్నికల్ ఏఓ సరిత, సర్పంచులు మిర్యాల వెంకన్న, గుర్రం సత్యం, ఏఈఓలు మాదగోని నర్సింహాగౌడ్, శశాంక్, దుర్గా భవాని, యాదగిరి, వెంకటేశం, వహిద్, ఏటీఎం జయంత్, హార్టికల్చర్ అధికారి శ్వేత పాల్గొన్నారు. అలాగే మండలంలోని మునుగోడు, పులిపలుపుల, కొరటికల్, పలివెల, కొంపల్లి, చల్మెడలో ర్యాలీలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు.
చిట్యాల: మండలంలోని చిట్యాల, ఉరుమడ్ల, వెలిమినేడు, చిన్నకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల్లో రైతువేదికలో అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఓ పగిడిమర్రి గిరిబాబు, సర్పంచులు దేశబోయిన మల్లమ్మ, కంచర్ల శ్రీనివాస్రెడ్డి, జంగం రవీందర్, మోహన్రెడ్డి, రత్నం పుష్పమ్మ, ఎంపీటీసీలు వడ్డెపల్లి లక్ష్మయ్య, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య, ఏఈఓలు పాల్గొన్నారు.
మర్రిగూడ : మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బచ్చు రామకృష్ణ మాట్లాడారు.కార్యక్రమంలో ఏఓ స్పందన, ఏఈఓ లక్ష్మీప్రసన్న, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్లు బండ రమేశ్, కల్లు రాంరెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాపోలు యాదగిరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొల్కులపల్లి యాదయ్య పాల్గొన్నారు.
కనగల్: మండలంలోని కనగల్, జి యడవల్లి, పగిడిమర్రి, చర్లగౌరారం, చిన్నమాదారం గ్రామాల్లోని రైతు వేదికల్లో అవగాహన సదస్సు కల్పించారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి గిరిప్రసాద్, కనగల్ ఏఓ అమరేందర్గౌడ్, ఏఈఓలు నవీన్, గౌతమి, విజయలక్ష్మి, అభిలాష్, శిరీష్, సర్పంచులు దేప నరేందర్రెడ్డి, చింతల యాదగిరి, క్రాంతిశ్రీనివాస్, ఎంపీటీసీలు ఎర్రమాద వెంకట్రెడ్డి, ఉపసర్పంచ్ వెంకన్న పాల్గొన్నారు.