విభిన్న వర్గాలు.. వేర్వేరు ప్రాంతాలు.. ఒకరిది వేతన పెంపు సంతోషం.. మరొకరిది సర్కారు అందించిన ధీమా.. ఇంకొకరిది ఫలించిన దశాబ్దాల సాగునీటి నిరీక్షణ. ప్రతి మోములోనూ ఆనందం. అందరి కండ్లల్లోనూ కృతజ్ఞతా భావం. ఉప్పొంగిన సంతోషంతో అందరి నోటా ఒక్కటే మాట జై కేసీఆర్. సఫాయి అన్నలు, గీత కార్మికులు, రైతులు.. ఇలా సబ్బండ వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్తున్నారు. వేతన పెంపుపై పారిశుధ్య కార్మికులు, బీమా సౌకర్యంపై గీతన్నలు, ఉదయసముద్రం ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అవడంతో రైతులు సీఎం ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ఈ కార్యక్రమాలు సాగాయి. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి ఫ్లెక్సీలకు మున్సిపల్ కార్మికులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు సిలివేరు ప్రభాకర్, మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంపటి గురూజీ, కౌన్సిలర్ తాహేర్పాషా, బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సమీ, కార్మిక సంఘాల నాయకులు వల్దాస్ మధుసూదన్, చింతమల్ల సోమయ్య, గట్టు నరేశ్, జి.నాగరాజు, ఎ.వెంకటాద్రి, ప్రవీణ్, సీహెచ్.వేణు, యాకమ్మ, కుమారి, సువార్త, సైదమ్మ, వి.సోమమ్మ పాల్గొన్నారు.
– బొడ్రాయిబజార్, మే 4
బీఆర్ఎస్, గౌడ సంఘం ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫ్లెక్సీలకు గురువారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాచకొండ వెంకన్న, నాయకులు చౌగోని సైదులు, రాచకొండ సునీల్, చౌగోని లక్ష్మణ్, కొండ యాదగిరి, చౌగోని శంకర్, బెజవాడ రామకృష్ణ, కొండ వినయ్, గునుగుంట్ల వెంకన్న, పల్స నరేశ్, రాచకొండ శ్రీధర్, పోతుల రవీందర్, గుర్రం గణేశ్, గడ్డం స్వామి, బానోతు వెంకన్న, అమీర్పాషా, యాతాకుల సోమయ్య పాల్గొన్నారు.
– నకిరేకల్, మే 4
అడగకముందే వరాలిచ్చే వరప్రదాత సీఎం కేసీఆర్కు పలువురు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుపై కార్మికులు, గీత కార్మికులకు బీమా సౌకర్యంపై గౌడన్నలు, ఉదయసముద్రం ట్రయల్ రన్ విజయవంతం కావడాన్ని హర్షిస్తూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఆయకట్టు రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలకు గురువారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల మనోగతం తెలిసిన నాయకుడు సీఎం కావడం అదృష్టమని పేర్కొన్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు.