యాదాద్రి భువనగిరి/ అడ్డగూడూరు, నమస్తే తెలంగాణ, జూలై 11 : జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుపనులు జోరందుకున్నాయి. వరి నాట్లకు అనుకూలంగా ముసురు కురుస్తుండటంతో వరిసాగు చేసే రైతులు పొలాలను దున్ని సిద్ధం చేసుకుంటున్నారు.
ఇప్పటికే దుక్కులు దున్నిన వారు నాట్లు వేస్తున్నారు. వర్షానికి చెరువులు, కుంటల్లో నీరు చేరుతుండడంతో బోరుబావుల్లో సైతం నీటిమట్టం పెరుగుతున్నది.