కనగల్, ఏప్రిల్ 26 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం, దర్వేశిపురం, తేలకంటిగూడెం, చెట్లచెన్నారం, శేరి లింగోటం, తిమ్మన్నగూడెం, అమ్మగూడెం, ఎం.గౌరారం, తుర్కపల్లి, పర్వతగిరి, బుడుమర్లపల్లి, బోయినపల్లి, బచ్చన్నగూడెం, జి.యెడవల్లి, కురంపల్లి, రాంచంద్రాపురం, రేగట్టే, శాబ్దుల్లాపురం, పగిడిమర్రి, దోరెపల్లిలో ఐకేపీ కేంద్రాలు, చెట్లచెన్నారం, లచ్చుగూడెం, కనగల్ లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపుతున్న సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పడం అభినందనీయం అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్రావు, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, ఏపీఎం నరహరి, మహిళ అధ్యక్షురాలు మర్రి రేణుక, జిల్లా నాయకులు ఎర్రబెల్లి నర్సిరెడ్డి, ఎర్రమాద వెంకట్రెడ్డి, గోన రవీందర్రావు, నల్లబోతు యాదగిరి, చనగాని నాగరాజు, సర్పంచ్లు చింతల యాదగిరి, అల్గుబెల్లి పూలమ్మ, బొగరి రాంబాబు, గన్నెబోయిన గంగమ్మాచంద్రయ్య, ఆవురేశి క్రాంతి,శ్రీనివాస్, గుండెబోయిన రమేశ్, సింగం కోటేశ్, నాగులవంచ సులక్షణాశేఖర్రావు, ఆదిమల్ల లింగయ్య, చనగాని అంజమ్మారామచంద్రు, కారింగు పార్వతమ్మాజానయ్యగౌడ్, నర్సింగ్ సునీతాకృష్ణయ్యగౌడ్, పగిళ్ల యాదయ్య, రామలచ్చయ్య, పులకరం యాదమ్మామారయ్య, తలారి కరుణాశ్రీరవీందర్, మల్లేపల్లి అనిల్, కడారి కృష్ణయ్య, దాసిరెడ్డి జ్యోతీరవీందర్రెడ్డి, గోలి నర్సిరెడ్డి, కళావతీభాస్కర్రెడ్డి, ఎంపీటీసీలు పాలకూరి సైదులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
హాలియా : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. అనుముల మండలం యాచారం కొత్తపల్లి సహకారం సంఘం, మారేపల్లి, పులిమామిడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు లు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, సర్పంచులు గుండెబోయిన వెంకన్న, చెదురువెల్లి రాము లు, పీఏసీఎస్ చైర్మన్ రిక్కల మధు, వైస్ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, వెంపటి శంకరయ్య, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్, ఎంపీటీసీలు, నాయకులు ఎన్నమల్ల సత్యం, దుండిగల్ల శ్రీను, యడవల్లి నాగరాజు, నక్క యాదయ్య పాల్గొన్నారు.
నిడమనూరు :నిడమనూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో వేంపాడు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపీపీ, టీ ఆర్ఎస్ జిల్లా నాయకుడు చేకూరి హనుమంతరావు ఎన్డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్యతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో అనుముల అసిస్టెంట్ రిజిస్ట్రార్ మురళీచారి, మండల పరిషత్ సలహాదారుడు బొల్లం రవియాదవ్, ముకుందాపురం సర్పంచ్ కేశ శంకర్, పీఏసీఎస్ సీఈఓ జానయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా వెనిగండ్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో రాజన్న గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ కేవీ రామారావు పారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, ఎంపీటీసీ చింతమల్ల ప్రమీలావెంకన్న, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తడకమళ్ల శేఖర్, మాజీ చైర్మన్ అశోక్, ఇన్చార్జి సీఈఓ పోలె రవి, డైరెక్టర్ కాట్నం రవి పాల్గొన్నారు.
మాడ్గులపల్లి : మండలంలోని మాచనపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అం జయ్య ప్రారంబించారు. గ్యారకుంటపాలెంలో ఐకేపీ కేంద్రాన్ని సర్పంచ్ జొన్నలగడ్డ విజయ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ జూలకంటి పద్మ, ఇన్చార్జ్జి ఏఓ రిచిద్రమణి, సీఈఓ జానయ్య, నాయకులు పిచ్చిరెడ్డి, మాధవరెడ్డి, పగిళ్ల సైదులు, కాకునూరి వెంకన్న, యాదయ్య, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ఆలగడప పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ యాదగిరి, ఏఈఓ రమేశ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.