నల్లగొండ : రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని అడిషనల్ ఎస్పీ జి. మనోహర్ అన్నారు.
ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్ లచ్చు నాయక్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దానం కార్యక్రమంలో మనోహర్ రక్త దానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ప్రతి ఒక్కరు కనీసం సంత్సరానికి 3 సార్లు రక్త దానం చేయాలన్నారు. ఎంతో మంది పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటి వారిని ఆదుకొని ప్రాణ దాతలు కావాలన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడు సమాజ భద్రతే కాకుండా సమాజ సేవ చేయుటకు కూడా ముందు ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ యస్. ఐ రాజశేఖర్ రెడ్డి, మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ నిత్యానంద్, పోలీస్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ పాల్గొన్నారు.