నిడమనూరు, నవంబర్ 25 : గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపన రాష్ట్రం లో సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని విద్యు త్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని బంకాపురం గ్రామంలో రూ. 21 లక్షలతో నిర్మించిన పంచాయతీభవనం, రూ.12.5 లక్షలతో నిర్మించిన వైకుంఠధామంను ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి, హరితహారం, పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్గా నిలిచిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, దాంతో ఓర్వలేక బీజేపీ కుట్రపూరితంగా దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. యాదాద్రి పవర్ప్లాంట్కు నిధులు నిలిపివేసే కుట్రకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీజేపీ కుట్రలపై ఉద్యమించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా సాగర్ నియోజకవ ర్గానికి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారని చెప్పారు. గ్రామీణ రహదారులు, కల్వర్టులు ఇతరత్రా నిర్మాణాలు చేపడతామన్నారు.
ఐదారు నెలల్లో నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. అనంతరం స్థల దాతలు ప్రవాస భారతీయుడు ఉన్నం సత్యనారాయణ, పాంపాటి యాదగిరి దంపతులను మంత్రి సత్కరించారు. పంచాయతీ భవనం ఆవరణలో మంత్రి మొక్క నాటారు.
సర్పంచ్ ఉన్నం శోభాసత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ట్రైకార్ చైర్మన్ రాంచందర్నా యక్, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ అంజయ్య, జడ్పీటీసీ రామేశ్వరి, పీఏసీఎస్ చైర్మన్ కేవీ రామారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, ఎంపీపీ సలహదారు రవియాదవ్,నాయకులు గురువయ్య యాదవ్, రంజిత్యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్లు వెంకట్రెడ్డి, జానయ్య, మర్ల చంద్రారెడ్డి, మధు, చిన్నవెంకటేశ్వర్లు, పేరయ్య, శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
రామగిరి,నవంబర్ 25: మానవ హ క్కుల వేదిక ఉమ్మడి జిల్లా 9వ మహాసభలను శనివారం నల్లగొండ జూనియర్ లెక్చరర్స్ భవనంలో నిర్వహించనున్నట్లు ఆ సం ఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోసుల మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.