తుంగతుర్తి, ఫిబ్రవరి 06 : ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని, కూలీల హక్కులను కాలరాసే చర్యలను మానుకోవాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు దర్శనం రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపు పేరుతో పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరారు.