నందికొండ, జనవరి 2 : నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో నూతనంగా రూ. 70 లక్షల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. బుధవారం డయాలసిస్ కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, ప్రారంభించనున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 17 కోట్లతో నిర్మించిన ఈ 100 పడకల దవాఖానలో డయాలసిస్ కేంద్రం కూడా ఏర్పాటు చేయడంతో నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందుబాటులోకి రానున్నాయి. అంతకుముందు కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం 60 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రానికి, మాచర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా స్థానికంగా అందుబాటులోకి వచ్చింది. కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో 5 డయాలసిస్ యంత్రా లను ఏర్పాటు చేశారు. ఒక్కో యంత్రం రోజుకు నలుగురికి డయాలసిస్ చేయనున్నది.
డయాలసిస్ రోగులకు నిరంతర సేవలు
కిడ్నీ సంబంధ రోగులు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉచితంగా కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. డయాలసిస్ కేంద్రంలో 5 బెడ్ల్ను ఏర్పాటు చేశాం, రోజుకు 20 మందికి డయాలసిస్ చేయనున్నాం. కరోనా సమయంలో కిడ్నీ రోగులు అనేక రకాలు ఎదు ర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడే డయాలసిస్ చేయించుకోవచ్చు. డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
– భానుప్రసాద్, కమలా నెహ్రూ ఏరియా దవాఖాన చీఫ్ మెడికల్ ఆఫీసర్