సూర్యాపేట రూరల్, మే 20 : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు చింత సాంబయ్యకు చెందిన కిరాణం షాపు, బాలెంల గ్రామం స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన చింత వెంకన్నకు చెందిన టెంట్హౌజ్ను మంత్రి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. లబ్ధిదారులు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని మంత్రి ఆకాక్షించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఎండీ చాంద్పాషా, ముదిరెడ్డి సంతోష్రెడ్డి, ఎస్కే రఫీ, నునావత్ మోతీలాల్, సంకరమద్ది రమణారెడ్డి, మాలి అనంత్రెడ్డి, పులగం వెంకట్రెడ్డి, చింతలపాటి మధు, గౌని లక్ష్మణుడు, చౌగోని సంతోష్గౌడ్, అనంతుల వాసుదేవరెడ్డి, మామిడి తిరుమల్ పాల్గొన్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులునింపేందుకే దళిత బంధు
ఆత్మకూర్.ఎస్ : అణిచివేయబడ్డ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని నెమ్మికల్ గ్రామంలో లబ్ధిదారుడు చందాదాసు ఏర్పాటు చేసిన సిమెంట్ అండ ఐరన్ దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నట్లు తెలిపారు. పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ లబ్ధిదారులు సమాజంలో ఉన్నతంగా ఎదుగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మారిపెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు.