పెద్దవూర, అక్టోబర్ 31 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి ప్రారంభమైందని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని తుంగతుర్తి, రామన్నగూడెం, రామన్నగూడెంతండా, ఏనిమీదితండా, పొట్టెవానితండా, నాయనవానికుంటతండా, జయరాంతండా, కొత్తతండా, పర్వేదుల, పాల్తీతండా, మర్రిపురి తండా గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రం ఇంకా అభివృద్ధి కావలంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. 64 సంవత్సరాలు రాష్ర్టాన్ని, దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గతంలో అనేక పర్యాయాలు మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. నియోజకవర్గం పూర్తిగా వెనుక బడడానికి ఆయనే కారణమన్నారు. గెలువగానే హైదరాబాద్కు మకాం మార్చి ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకనే కొడుకును నిలబెట్టాడని విమర్శించారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే నాగార్జునసాగర్ అభివృద్ధి ప్రారంభమైందని తెలిపారు. హాలియా, నందికొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కేదే అన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమాతో పాటు పుష్కలంగా సాగునీటిని అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ పథకంతో లబ్దిపొందని ఇల్లు లేదన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింతగా పెంచనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా కేసీఆర్ భరోసా పేరుతో ప్రతి ఇంటికీ బీమా అందిస్తామని, అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్ సిలెండర్, పేద మహిళలకు రూ.3వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. దాంతో పాటు రైతుబంధు, ఆసరా పింఛన్లను సైతం పెంచనుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలని.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రతి గ్రామంలో చర్చ జరపాలన్నారు. బీఆర్ఎస్కు ప్రజలే బాస్లని, ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుందని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఢీల్లీ పెద్దలే బాస్లని, వారు చెప్పినట్లు రాష్ట్ర నాయకులు చేస్తారే తప్పా ప్రజల గురించి ఆలోచించరని, ఈవిషయాన్ని ప్రజలు గుర్తుంచుకోలని కోరారు. ప్రజల బాగోగులు పట్టించుకునే బీఆర్ఎస్కే రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.
కడుపు నింపే కేసీఆర్ కావాలా..కడుపుకొట్టే కాంగ్రెస్ కావాలా ..: ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా పేదలు, బడుగు, బలహీన వర్గాల కడుపు నింపుతున్న బీఆర్ఎస్ పార్టీ కావాలా.. పేదల కడుపుకొట్టే కాంగ్రెస్ కావాలా అనేది ప్రజలు ఆలోచన చేయాలని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ కోరారు. సమైక్య రాష్ట్రంలో గిరిజన తండాలను పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి తండా అభివృద్ధి పథంలో పయనిస్తున్నదంటే.. ఆ ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ఏనాడు గిరిజన సమస్యలు పట్టించుకోని మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పుడు ఏముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ గజ్జెల లింగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, ప్రధాన కార్యదర్శి కర్నాటి మునిరెడ్డి, మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ అబ్బాస్, బీఆర్ఎస్ కార్మిక వర్గం ప్రధాన కార్యదర్శి షేక్ బషీర్, పార్టీ యూత్ మండలాధ్యక్షుడు మెండె సైదులు యాదవ్, నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, వాసుదేవుల సత్యనారాయణ, రమావత్ రవినాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
కాగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిక
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఆకర్షితులై మండలంలోని పలు గ్రామాలకు చెందిన 100 కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు మంగళవారం ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు