చందంపేట, మార్చి 1 : చందంపేట మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులగడ్డ, చిత్రియాల, పెద్దమూల, గాగిళ్లాపురం, మానావత్తండా, గన్నెర్లపల్లి గ్రామాల్లో శుక్రవారం సీసీ రోడ్లు, నూతన పంచాయతీ భవనం, డ్రైనేజీ, చిత్రియాల జడ్పీహెచ్ఎస్లో ప్రహరీ మండలంలో సుమారు రూ.1.66 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కంబాలపల్లి, పాత కంబాలపల్లి, చిత్రియాల, పెద్దమూల, రేకులగడ్డ గ్రామాల్లో నెలకొన్న రైతుల భూ సమస్యలను త్వరలో పరిష్కరించే విధంగా అధికారులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
పొగిళ్ల, కంబాలపల్లి లిఫ్టు పూర్తయితే ఆయా గ్రామాల్లో పదివేల ఎకరాలకు సాగు నీరు అందనుందని పేర్కొన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎంపీపీ నూన్సావత్ పార్వతీచందునాయక్, జడ్పీటీసీ బుచ్చి లచ్చిరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ జాలె నర్సింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ముక్కమల వెంకటయ్యగౌడ్, సిరాజ్ఖాన్, హరికృష్ణ, ఎడ్ల అంజయ్య, మాధవాచారి, సత్తయ్య, తిరుపతయ్య, ఎంపీటీసీ లక్ష్మానాయక్, రజిత, బద్యానాయక్, సుభాశ్, రమేశ్, నాగేశ్వర్నాయక్, జగన్, మాజీ సర్పంచ్ బాలు, శైలేందర్, పాల్గొన్నారు.