విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ బుధవారం మధ్యాహ్నం ఘట్కేసర్ మండలం అంకుషాపూర్-ఎన్ఎఫ్సీ నగర్ మధ్య పట్టాలు తప్పింది. ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నా, ప్రమాదం కారణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు రైళ్లు నిలిచిపోయాయి. పల్నాడు, ఫలక్నుమా, శబరి, భాగ్యనగర్, నారాయణాద్రి, నర్సాపూర్, పద్మావతి, విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లు నల్లగొండ, బీబీనగర్ రైల్వే స్టేషన్లలోనే ఆగిపోయాయి. గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులు చాలామంది చివరికి ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. నల్లగొండలో రైల్వే, సివిల్ పోలీసులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి 5 బస్సుల్లో హైదరాబాద్కు చేర్చారు.
– నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 15
బీబీనగర్ / నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 15 : విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ మలాజ్గిరి జిల్లా ఘటేసర్ మండలం అంకుషాపూర్, ఎన్ఎఫ్సీనగర్ మధ్యలో పట్టాలు తప్పింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండల రైల్వేస్టేషన్లో భాగ్యనగర్, నారాయణాద్రి, నర్సాపూర్, పద్మావతి, విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లతో పాటు పలు గూడ్స్ ట్రైన్లు, నల్లగొండ జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో పల్నాడు, ఫలక్నుమా, శబరి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచి పోయాయి.
గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే, సివిల్ పోలీసులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి నల్లగొండ నుంచి ఐదు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను హైదరాబాద్కు తరలించారు. కొందరు ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి తరలివెళ్లారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనాదారులు నల్లగొండ నుంచి హైదరాబాద్కు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.300 వరకు వసూలు చేశారు. మార్గం సుగమమయ్యాక ఆగిన ట్రైన్లను రైల్వే అధికారులు వన్వే మీదుగా క్రమబద్ధంగా తరలిస్తున్నారు.