తిరుమలగిరి/నూతనకల్/తుంగతుర్తి/అర్వపల్లి, ఏప్రిల్ 4 : తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్కు 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై బీఆర్ఎస్ గిరిజన నాయకులు, సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుమలగిరి, నూతనకల్, తుంగతుర్తి, అర్వపల్లి మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్, మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తుందన్నారు. బంజారా భవనానికి నిధులు మంజూరు చేయించిన మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ తిరుమలగిరి, నూతనకల్ మండలాధ్యక్షులు రఘునందన్రెడ్డి, మున్న మల్లయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మాజీ ఎంపీపీ సతీశ్, పీఏసీఎస్ చైర్మన్లు పాలెపు చంద్రశేఖర్, కనకటి వెంకన్న, సర్పంచులు లునావత్ స్వాతీరవిందర్, రమావత్ పీరమ్మ, గుగులోతు మాణిక్యం, జిల్లా నాయకులు భూరెడ్డి సంజీవరెడ్డి, బత్తుల సాయిల్గౌడ్, ఎంపీటీసీలు పన్నాల రమామల్లారెడ్డి, బానోతు విక్కు, ఉప సర్పంచ్ సుజాత, నాయకులు ప్రశాంత్రెడ్డి, శంకర్నాయక్, సజ్జన్నాయక్, నర్సింహనాయక్, రమేశ్నాయక్, దామోదర్నాయక్, గుండగాని రాములు, దీప్లానాయక్, యాకూనాయక్, విజ్జినాయక్, శంకర్నాయక్, వీరోజి, వెంకన్ననాయక్, రాములునాయక్, భాస్కర్, శ్రీను, ఉప్పలయ్య, యాదగిరి, వెంకన్న, భిక్షం, రమేశ్గౌడ్, సంజీవనాయక్, కేలోతు రవీందర్, శ్రీను, అచ్చమ్మ, బుజ్జమ్మ, భీమా, సురేందర్, నాగులు, వెంకటేశ్ పాల్గొన్నారు.