హుజూర్నగర్/పాలకవీడు, జనవరి25 : జాన్పహాడ్ దర్గాను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం జాన్పహాడ్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దర్గా ముజావర్ సయ్యద్ జాని ఎమ్మెల్యేకు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. అనంతరం సైదులు బాబా సమాధివద్ద చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రైతుబంధు సమితి జిల్లాకమిటీ సభ్యుడు మలమంటి దర్గారావు, స్థ్ధానిక పెట్రోల్బంక్ యాజమాన్యం దర్గాలోపల ఏర్పాటు చేసిన నాలుగు ఏసీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ను కలిసి అడిగిన వెంటనే దర్గా అభివృద్ధికి రూ. 50 లక్షలలను మంజూరు చేసినట్లు చెప్పారు. దాంతో పాటు శివరాత్రి సందర్భంగా మేళ్లచెర్వు స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగే జాతరకు కూడా రూ.50లక్షలు మంజూరు చేశారని, ఈ మేరకు జీఓ కూడా విడుదల చేసిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేళ్లచెర్వులో శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఎద్దుల పందేలు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ఈ పందేలను చూసేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వచ్చే అవకాశం ఉందన్నారు.
నియోజకవర్గంలో లిఫ్టు పనులు కూడా ప్రారంభమయ్యాయని, ప్రతిపక్షాలు కోర్టులో కేసులను ఉపసంహరించుకొని అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేసి ఉర్సును విజయవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కిష్టపాటి అంజిరెడ్డి, గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి భూక్యా రవినాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎరెడ్ల సత్యనారాయణరెడ్డి, హుజూర్నగర్ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, నాయకులు కృష్ణ, పిచ్చయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్, రామకృష్ణ, అలీ ఉన్నారు.