ధూళిపాళ అరుణ రచించిన ‘తారావళీ సప్తకం’ (ఆచార్య అప్పాజోస్యుల వారి తారావళీ సప్తకం) పుస్తకావిష్కరణ-అంకితోత్సవం ఈనెల 5వ తేదీ సాయం త్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది. మూసీ సాహిత్య ధార, మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకరశర్మ అధ్యక్షత వహిస్తారు.
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య ముఖ్య అతిధిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. గన్నమరాజు గిరిజా మనోహరబాబు పుస్తక విశ్లేషకుడిగా వ్యవహరిస్తారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, డా.ఏల్చూరి మురళీధరరావు, డా.కొండపల్లి నీహారిణి ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు. ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ కృతి స్వీకర్తగా వ్యవహరిస్తారు.