ధూళిపాళ అరుణ రచించిన ‘తారావళీ సప్తకం’ (ఆచార్య అప్పాజోస్యుల వారి తారావళీ సప్తకం) పుస్తకావిష్కరణ-అంకితోత్సవం ఈనెల 5వ తేదీ సాయం త్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది.
ఆమెకు వ్యక్తిత్వం పట్ల అభిరుచి. మానవత్వం పట్ల అభిరుచి. సమాజ హితవు పట్ల అభిరుచి. ఇవన్నీ ఒక పార్శ్వం అయితే భాష పట్ల, సాహిత్యం పట్ల, సాహిత్యంలోని వివిధ ప్రక్రియల పట్ల వల్లమాలిన అభిరుచి ఉండటం మరో పార్శ్వం.