భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు టీకాపై అవగాహన కల్పించి టీకా తీసుకునేలా ప్రొత్సహించాలని అధ్యాపకులకు సూచించారు. కళాశాలకు వచ్చే విద్యార్థులు, అధ్యాపకులు మాస్కులు ధరించాలన్నారు.
కళాశాలలో భౌతికదూరం పాటించేలా గదులను ఏర్పాటు చేయాలని, గదులను ప్రతిరోజూ శానిటైజేషన్ చేయాలని తెలిపారు. కళాశాలల్లో శానిటైజర్లు, మాస్కులు, అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గడ్డం సోమ్చంద్, ప్రిన్సిపల్ నాగూశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ మల్లేశం, అధ్యాపకులు కొండల్రెడ్డి, శ్రీధర్గౌడ్, శ్రవణ్కుమార్, పరుశురాం, చంద్రశేఖర్, స్వామి, సంతోష్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.