మునుగోడు, డిసెంబర్ 26 : రైతు దేశానికి వెన్నుముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సస్యశ్యామంగా ఉంటుందన్న నానుడిని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. రైతున్నలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. అయితే విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో సమస్యలను పరిష్కారానికి ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లోని కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులు తమకు ఎలాంటి సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్లో ఫిర్యాదు చేస్తే వారు స్పందించి తక్షణమే పరిష్కరిస్తారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,82,83 కనెక్షన్లు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,82,838 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. అయితే పెరుగుతున్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు అనుగణంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ఏర్పాటు చేసినా కనెక్షన్లు పెరిగినా సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
24 గంటలు ఫిర్యాదుల స్వీకరణ..
నల్లగొండ, యాద్రాది భువనగిరి, సూర్యాపేట విద్యుత్తు శాఖ సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ల్లో 24 గంటలు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా రైతులు నల్లగొండలోని సర్కిల్ కంట్రోల్ రూమ్ 9440814326, సూర్యాపేటలో 8331842074, యాదాద్రి భువనగిరి రైతులు 9491065938 ఫోన్ నంబర్కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వారు ఫిర్యాదు స్వీకరించిన వెంటనే సంబంధిత అధికారులు, సిబ్బందికి సమాచారాన్ని చేర వేస్తారు. తద్వారా సమస్య వెంటనే పరిష్కారం కానున్నది
వెంటనే స్పందిస్తాం..
వ్యవసాయ విద్యుత్తు విషయంలో ఇబ్బందులు లేకుండా చూస్తాం. సమస్యలుంటే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులకు అదేశాలందాయి.
-సీహెచ్.శంకరయ్య, ఇంజినీర్, నల్లగొండ డివిజనల్