తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో
12 మన ఊరు – మన బడి పాఠశాలలను ప్రారంభించారు. 178 స్కూళ్లలో రీడింగ్ కార్నర్స్ (గ్రంథాలయాలు)కు శ్రీకారం చుట్టారు. 82 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు షురూ చేశారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులను సన్మానించారు. పాఠశాలల్లో రాగి జావ పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యా ప్రగతిని వివరించారు. భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. అంతకు ముందు ఆలేరు మండలంలోని శారాజీపేటలో మన ఊరు.. మన బడి ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వ విప్ సునీతా ప్రారంభించారు. భువనగిరి మండలం అనాజిపురంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు యూనిఫామ్, రాగి జావ పంపిణీ చేశారు. రామన్నపేట మండలం జనంపల్లి ప్రాథమిక పాఠశాలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమాల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
– యాదాద్రి భువనగిరి, జూన్ 20 (నమస్తే తెలంగాణ)
రాజాపేట, జూన్ 20 : ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని రఘునాథపురంలో విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. అంతకు ముందు డిజిటల్ బోర్డులు ప్రారంభించారు. విద్యార్థులకు రాగి జావ అందించారు. దాత సంగిసెట్టి రవికుమార్ అందించిన నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, ఎంఈఓ కృష్ణ, సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్కుమార్, హెచ్ఎం బాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, జిల్లా విజిలెన్స్ సభ్యుడు సందిల భాస్కర్గౌడ్, బీఆర్ఎస్వై అధ్యక్షుడు పల్లె సంతోష్గౌడ్, మండల యువజన ప్రధాన కార్యదర్శి డొంకెన మహేందర్గౌడ్, నాయకులు నర్సింహులు, వెంకటేశం, సర్పంచ్లు గుంటి మధుసూదన్రెడ్డి, బూర్గు భాగ్మమ్మానర్సిరెడ్డి, పరిమళాసంపత్, ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్ పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు
ఆలేరు రూరల్ : సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని శారాజీపేటలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఆధునీకరించిన ప్రాథమిక పాఠశాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో సర్కారు బడులకు మహర్దశ పట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడితో పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాలలో గ్రంథాలయాన్ని ప్రారంభించి విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. డీఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, ఎంఈఓ కృష్ణ, పీఆర్డీఈ హేమంత్కుమార్, ఎంపీఓ సలీం, సర్పంచ్ బండ పద్మాపర్వతాలు, ఉప సర్పంచ్ కంతి మహేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, భాస్కరాచారి, పంచాయతీ కార్యదర్శి స్వప్న, ఏపీఎం మీనా, నాయకులు పాల్గొన్నారు.
ఆలేరులో&
ఆలేరు : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆలేరు మైనార్టీ గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన విద్యా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బింగి గణేశ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, 3వ వార్డు కౌన్సిలర్ బేతి రాములు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు సీస రాజేశ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి వెంకటేశ్, అధికార ప్రతినిధి ముదిగొండ శ్రీకాంత్, మాజీ పట్టణాధ్యక్షుడు పోరెడ్డి శ్రీను, యూత్ లీడర్ పూల శ్రవణ్, మైనార్టీ జిల్లా నాయకుడు ఫయాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుతాటి అంజన్కుమార్, మహేంద్ర యువసేన అధ్యక్షుడు జూకంటి వెంకటేశ్, కటకం మల్లేశం, చిమ్మి శివమల్లు, మదార్ పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం : జడ్పీ చైర్మన్
బొమ్మలరామారం : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. దశాబ్డి ఉత్సవాలల్లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని రామస్వామితండా, నాగినేనిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన విద్యా దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామస్వామి తండా ప్రాథమిక పాఠశాలలో నూతన భవనాన్ని, రీడింగ్ కార్నర్ను ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్య ఆవశ్యకతను తెలుపుతూ ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 12 అంశాల్లో పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, ఎంపీడీఓ సరిత, సర్పంచ్ భట్కీర్ బీరప్ప, హెచ్ఎంలు సీవీ శ్రీనివాస్, లక్ష్మీకుమారి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్గౌడ్, నాయకులు కొండోజు ఆంజనేయులు, గొడుగు చంద్రమౌళి, జూపల్లి భరత్, మల్లేశం, పాచ్యానాయక్, బేద్యానాయక్, ఎస్ఎంసీ చైర్మన్ బేతాళ స్వప్న పాల్గొన్నారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాంపురం ఆదర్శ పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ సుశీలారవీందర్, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్, ఎంపీడీఓ ఉమాదేవి పాల్గొని పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమెంటోలతోపాటు దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. దత్తాయపల్లి, తుర్కపల్లి, మాదాపురం, వాసాలమర్రి పాఠశాలల్లో జాతీయజెండాలు ఎగురవేశారు. పలు పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సర్పంచ్లు రామ్మోహన్శర్మ, పడాల వనిత, పోగుల ఆంజనేయులు, సత్యనారాయణ, కల్లూరి ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో..
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంతోపాటు గ్రామగ్రామాన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో విద్యా ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు.