మధిర, ఆగస్టు 11: మధిర పట్టణంలో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర విధ్వంసానికి, అవినీతికి పాల్పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మధిరలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మధిర మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల కమల్రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మధిరలో ఎలాంటి ప్రగతి జరగలేదని అన్నారు. రూ.128 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించి 17నెలలు కావొస్తున్నా ఏ ఒక వీధిలోనూ పని సంపూర్ణం ఎందుకు కాలేదన్నారు.
పట్టణమంతా రోడ్లు తవ్వి గతుకులమయం చేశారని, అంబులెన్స్ కూడా రాలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కమీషన్లు వచ్చే పనులను మాత్రమే కాంగ్రెస్ నేతలు శరవేగంగా చేస్తున్నారని ఆరోపించారు. శ్మశానవాటికలో మట్టి పోసినందుకు రూ.18 లక్షలు, గతంలో తాము రూ.4 లక్షలతో చేసిన జిమ్ పనులకు రూ.40 లక్షల బిల్లులు వేసుకుని దోచుకున్నారని విమర్శించారు. మధిరలో మున్నేరు వరద తాకిడి నుంచి రక్షణ కోసం నిర్మిస్తున్న గోడ విషయంలో రైతుల భూములను అక్రమంగా లాకుంటున్నారని, ముందస్తు సమాచారం లేకుండా నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అవినీతిపై రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్కు వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు యాన్నంశెట్టి అప్పారావు, బికీ కృష్ణప్రసాద్, రావూరి శ్రీనివాసరావు, పల్లబోతుల వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, ఆరిగె శ్రీనివాసరావు, బొగ్గుల భాసర్రెడ్డి, పరిశ శ్రీనివాసరావు, సయ్యద్ ఇక్బాల్, వంకాయలపాటి నాగేశ్వరరావు, నాగబాబు, ఉమామహేశ్వర్రెడ్డి, కపిలవాయి జగన్మోహన్రావు, బొగ్గుల వీరారెడ్డి, భువనగిరి నారాయణరావు, బానోతు కృష్ణ, చీరాల రాంబాబు, డోకుపర్తి సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు.