రానున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికల ఇన్చార్జిలను నియమించింది. నల్లగొండ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన నలమాద ఉత్తమ్కుమార్రెడ్డిని, భువనగిరి లోక్సభ స్థానానికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఇన్చార్జిలుగా ఆ పార్టీ ప్రకటించింది.
ఎన్నికల్లో ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను సమన్వయం చేస్తూ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తున్నది.