హాలియా, డిసెంబర్ 13: ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, సర్కారే ఆదుకోవా లని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. బుధవారం హాలియాలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. హాలియా ప్రధాన సెంటర్లో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఏదో మంచి జరుగుతుంది అనుకుంటే తమ పొట్ట మీద కొట్టారని అన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్, సూ రేపల్లి, పేరూరు రూట్ల ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.