రామగిరి, మార్చి 21 : తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లీం మైనార్టీలు సర్వతోముఖాభివృద్ధి సాధించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పచిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నల్లగొండలోని 22వ డివిజన్ పరిధిలో బీఅర్ఎస్ నేత శంషోద్దీన్ నివాసంలో ఏర్పాటు చేసిన రంజాన్ విందుకు ఆయన హాజరయ్యారు. అదే విచిధంగా పట్టణంలోని పలు ముస్లింల నివాసాలకు వెళ్లి ఆయా కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ముస్లీం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డట్లు తెలిపారు. ముస్లీం మైనార్టీల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెరిక కరణ్ జయరాజ్, రామాలయ మాజీ చైర్మన్ శర్మ, ముస్లింలు శమ్మీ, సీరాజ్, ఎండీ అమీరోద్దీన్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

కేసీఆర్ పాలనలోనే ముస్లింల సర్వతోముఖాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి